పంట ఉత్పత్తుల దిగుమతికి శ్రీలంక సంసిద్ధత

ABN , First Publish Date - 2021-09-18T09:45:57+05:30 IST

పంట ఉత్పత్తుల దిగుమతికి శ్రీలంక సంసిద్ధత

పంట ఉత్పత్తుల దిగుమతికి శ్రీలంక సంసిద్ధత

మంత్రి కన్నబాబుతో శ్రీలంక మంత్రి సదాశివం భేటీ

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీలో పండించే వరి, మిర్చి, పసుపు, చెరకు, వివిధ రకాల ఉద్యాన.. తదితర పంట ఉత్పత్తులను ప్రభు త్వ సంస్థల ద్వారా నేరుగా దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం ఆసక్తిగా చూపింది. శ్రీలంక వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి సదాశివం వియాలాండరన్‌, ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయ సమన్వయ కార్యదర్శి సెంథిల్‌ తొండమాన్‌ శుక్రవారం విజయవాడ క్యాంప్‌ ఆఫీ్‌సలో మంత్రి కన్నబాబుతో భేటీ అయ్యారు. ఏపీ నుంచి శ్రీలంక వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సెంథిల్‌ హామీ ఇచ్చారు. 


త్వరలో సేంద్రియ వ్యవసాయ విధానం: కన్నబాబు

రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానం రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. 2.5లక్షల మంది ఎస్సీ రైతుల్ని లక్ష్యంగా చేసుకుని, రైతుసాధికార సంస్థ, ఎస్సీకార్పొరేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. శుక్రవారం విజయవాడలో ఎన్‌బీఎన్‌ఎ్‌ఫ అధికారులతో మంత్రి సమీక్షించారు. టీటీడీకి 7వేల టన్నుల శనగలు అందించేందుకు త్వరలో ఒప్పందం చేసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-09-18T09:45:57+05:30 IST