సీఎం జగన్రెడ్డిది బరితెగింపు పాలన
ABN , First Publish Date - 2021-09-18T09:43:47+05:30 IST
సీఎం జగన్రెడ్డిది బరితెగింపు పాలన
అమరావతి రైతుల మండిపాటు... 640వ రోజుకు ఆందోళనలు
తుళ్లూరు, సెప్టెంబరు 17: రాష్ట్రంలో సీఎం జగన్రెడ్డి బరితెగింపు పాలన చేస్తున్నారని రాజధాని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 640వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, మూడు రాజధానుల ప్రతిపాదన కేవలం అమరావతిని నాశనం చేయటానికి వేసిన ఎత్తుగడ అని, జగన్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.