ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీనివాసరావు, జైకుమార్
ABN , First Publish Date - 2022-08-17T06:57:46+05:30 IST
ధవళేశ్వరం యూనిట్ ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా బొబ్బిలి శ్రీనివాసరావు, ఎస్. జైకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 11 పోస్టులకుగాను నామినేషన్, ఉపసంహరణ అనంతరం 10 పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి.
ధవళేశ్వరం, ఆగస్టు 16: ధవళేశ్వరం యూనిట్ ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా బొబ్బిలి శ్రీనివాసరావు, ఎస్. జైకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 11 పోస్టులకుగాను నామినేషన్, ఉపసంహరణ అనంతరం 10 పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. 3 ఉపాధ్యక్ష పదవులకు పలువురు పోటీ పడటంతో ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన ఎన్నికలలో లెక్కింపు అనంతరం ఉపాధ్యక్షు లుగా మెజార్టీ సాధించిన సిరిగినీడి సత్తిరాజు, సయ్యద్బాజీ, పీఎస్ శేషుకుమార్లు ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా పి.లక్ష్మణుడు, జాయింట్సెక్రటరీలుగా కె. సత్యశ్రీనివాస్ రాజు, ఎం. సతీష్కుమార్, ఎస్.ఆదిత్యసోమశేఖర్, మహిళా జాయింట్ సెక్రటరీగా ఎస్.వాసుదేవి, కోశాధికారిగా కేఎన్ గౌరీశంకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వీఆర్వీ చౌదరి ప్రకటించి నూతన కమిటీ చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన కమిటీని ఆల్ ఇండియా క్లాస్4 ఎంప్లాయీస్ అసోసి యేషన్ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవో జిల్లా సంఘ నాయకులు పాలపర్తి మూర్తిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పి.వెంకటకృష్ణ, ఎస్.చంద్రరావు, ఎ.ప్రసాద్ నూతన కార్యవర్గాన్ని పూలమాలలువేసి అభినందించారు.