టోల్‌ప్లాజా సిబ్బందిని గాయపర్చిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-11-05T01:31:14+05:30 IST

జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడులో దారుణం జరిగింది. టోల్‌ప్లాజా సిబ్బందిని పాయకరావుపేట వైసీపీ నాయకులు గాయపర్చారు.

టోల్‌ప్లాజా సిబ్బందిని గాయపర్చిన వైసీపీ నేతలు

విశాఖ: జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడులో దారుణం జరిగింది. టోల్‌ప్లాజా సిబ్బందిని పాయకరావుపేట వైసీపీ నాయకులు గాయపర్చారు. టోల్‌ప్లాజా చార్జి అడిగినందుకు ఉద్యోగి సత్యనారాయణను తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన వ్యక్తిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతోపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అతన్ని విశాఖ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్లో టోల్ ప్లాజా యాజమాన్యం పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నక్కపల్లి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. 

Updated Date - 2021-11-05T01:31:14+05:30 IST