‘సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు’
ABN , First Publish Date - 2022-05-19T02:29:47+05:30 IST
‘సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు’
రాజమండ్రి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం జగన్ కు మంత్రి చెల్లుబోయిన వేణు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో అత్యధికంగా అంబేద్కర్ విగ్రహాలు ఉన్న ప్రాంతం కోనసీమ అన్నారు. జిల్లాకు పేరు పెట్టడం ద్వారా నిత్యం బాబాసాహెబ్ పేరు తలచుకునేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సందర్బంగా కోనసీమ ప్రజాప్రతినిధులం సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.