ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-08-17T23:31:29+05:30 IST
ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం
అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. విద్యుత్ శాఖ ఏఈపై నెరిమెట్ల వైసీపీ సర్పంచ్ యోగేంద్రరెడ్డి దాడి చేశాడు. ఏఈ గురుమూర్తిని సర్పంచ్ యోగేంద్రరెడ్డి కాలుతో తన్నినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రాణ భయంతో విద్యుత్ శాఖ ఏఈ సచివాలయంలో తలదాచుకున్నట్లు వాపోతున్నాడు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారి ఇంటికి కనెక్షన్లు తొలగిస్తుండగా సర్పంచ్ యోగేందర్రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. తమ వారి ఇళ్లకు సర్వీస్ తొలగిస్తే అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసుల సహాయంతో ఏఈ గురుమూర్తి బయటకు వచ్చారు.