పోలీసులు, భద్రతా సిబ్బందికి గుంతల్లో నీరే దిక్కు

ABN , First Publish Date - 2022-07-04T01:04:42+05:30 IST

జిల్లాలోని భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

పోలీసులు, భద్రతా సిబ్బందికి గుంతల్లో నీరే దిక్కు

పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పెద అమిరం లో మోదీ పాల్గొనే బహిరంగ సభ వద్ద సరైన ఏర్పాట్లు కనిపించడం లేదు. కనీసం నీటి సౌకర్యం లేక  బందోబస్తు సిబ్బంది దేవులాట పరిస్థితి నెలకొంది. భోజనం చేసి గుంతల్లో నీటితో చేతులు శుభ్రం చేసుకున్న పరిస్థితి కనిపించింది. పోలీసులు, భద్రతా సిబ్బంది,  మహిళా హోమ్ గార్డులకు సైతం గుంతల్లో నీరే దిక్కుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  క్షత్రియ సేవా సమితి ఉమ్మడిగా చేస్తున్న కార్యక్రమంలో కనీసం నీటి సౌకర్యం కల్పించకపోవడంపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-04T01:04:42+05:30 IST