మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం
ABN , First Publish Date - 2022-07-02T20:30:50+05:30 IST
మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం
విశాఖ: జిల్లాలోని పాతగాజువాక బజాజ్ షోరూం మేడపై దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ళ యువతి మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి పోల రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలను కే.జి.హెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మలేశ్వరావు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు.