గోల్డ్ రాబరీ కేసులో వీడిన మిస్టరీ

ABN , First Publish Date - 2022-07-05T00:56:36+05:30 IST

గోల్డ్ రాబరీ కేసులో వీడిన మిస్టరీ

గోల్డ్ రాబరీ కేసులో వీడిన మిస్టరీ

విశాఖపట్నం: గోల్డ్ రాబరీ కేసులో మిస్టరీ వీడింది. విశాఖ శ్రీకన్య థియేటర్ రోడ్డులో జూన్ 30న చోరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. గోల్డ్ లోన్ కంపెనీ యజమాని రెడ్డిరాజు నాయుడు దగ్గర సినీ ఫక్కీలో రూ.16 లక్షలు దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతూ.... అప్పటి నుంచి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితుల్లో సూత్రధారి భీశెట్టి ప్రసాద్ సహా మరో ముగ్గురు నిందితలను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.80 లక్షలు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-05T00:56:36+05:30 IST