క్షుద్ర పూజల పేరుతో మహిళా బురిడీ
ABN , First Publish Date - 2022-07-06T02:00:04+05:30 IST
అబ్బన్నకాలనీలో క్షుద్ర పూజల పేరుతో జనాలను మహిళా బురిడీ కొట్టించింది. కష్టాలను గట్టెక్కిస్తాం ...సమస్యలను తీరుస్తామంటూ...
తిరుపతి: అబ్బన్నకాలనీలో క్షుద్ర పూజల పేరుతో జనాలను మహిళా బురిడీ కొట్టించింది. కష్టాలను గట్టెక్కిస్తాం ...సమస్యలను తీరుస్తామంటూ ఓ ఇంట్లో పూజలు ఆ మహిళ నిర్వహించింది. డబ్బాలోబంగారు నగలు, వెండి నగలు, నగదు ఉంచి పూజలు చేయడం ప్రారంభించింది. డబ్బాలో ఉంచిన నగలను ఆ మాయ లేడి మాయ చేసింది. విషయం గుర్తించిన బాధితులు ఆమెను వెంబడించి పట్టుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.