తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ
ABN , First Publish Date - 2022-10-07T22:19:40+05:30 IST
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ
తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 6 కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్లలో లక్షన్నర మంది భక్తులు వేచి ఉన్నారు.