ఆయన వీడియోలు తేల్చడానికి సమయం పడుతుందని మంత్రి రోజా అనడం దుర్మార్గం: టీటీడీ నేత
ABN , First Publish Date - 2022-08-08T02:45:35+05:30 IST
టీవీ చానెళ్ల యాజమాన్యం, కులాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ చిందులు వేయడం మానుకోకపోతే, ప్రజలు తరిమితరిమి కొడతారని టీడీపీ నేత పాతర్ల రమేష్ మండిపడ్డారు.
గుంటూరు: టీవీ చానెళ్ల యాజమాన్యం, కులాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ చిందులు వేయడం మానుకోకపోతే, ప్రజలు తరిమితరిమి కొడతారని టీడీపీ నేత పాతర్ల రమేష్ మండిపడ్డారు. గోరంట్ల సభ్య సమాజాన్ని తలదించుకునేలా వ్యవహరించినా, తప్పు చేశాడని వైసీపీ అనకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్ వీడియోలు తేల్చడానికి సమయం పడుతుందని, మంత్రి రోజా అనడం దుర్మార్గమన్నారు. మాధవ్ వీడియోలపై మహిళా కమిషన్ ఏం చేస్తోంది?, ఏపీలో దిశ చట్టం ఎక్కడా దాక్కొంది? అని ఆయన ప్రశ్నించారు. గోరంట్లపై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.