వరద బాధిత 700 కుటుంబాలకు కాయగూరల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-02T17:04:21+05:30 IST

గోదావరి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు గోదావరి వరద బాధితులకు వినుకొండ నియోజకవర్గం...

వరద బాధిత 700 కుటుంబాలకు కాయగూరల పంపిణీ

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): గోదావరి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు గోదావరి వరద బాధితులకు వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఐదు రకాల (పచ్చిమిర్చి, దోస, బెండకాయ, ఆనపకాయ, టమాటా) కాయ కూరగాయలను 700 కుటుంబాలకు సరిపడా పంపిణి చేశారు. వాటిని జీలుగుమిల్లి మండల కేంద్రంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు రిసీవ్ చేసుకుని జీలుగుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ ఇంటివద్ద వాటిని కుక్కునూరు మండలానికి చెందిన బాధితులకు ఇవ్వటానికి ప్యాకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షులు ఉండవల్లి సోమసుందరం, తెలుగుదేశం పార్టీ నాయకులు గూడపాటి పుల్లయ్య చౌదరి, దర్భ గూడెం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ తమ్మన సాంబశివరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు అక్కిరెడ్డి ప్రసాద్, రాచన్నగూడ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పులమూరి శివాజీ, బీసీ సంఘం ప్రెసిడెంట్ తోట బాలరాజు, గద్దె సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-02T17:04:21+05:30 IST