ఏసీబీకి పట్టుపడ్డ జూనియర్ అసిస్టెంట్
ABN , First Publish Date - 2022-06-28T22:56:18+05:30 IST
జిల్లాలోని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పలాస కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
శ్రీకాకుళం: జిల్లాలోని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పలాస కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.8 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.