ఘోర ప్రమాదం... ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2022-07-25T01:18:03+05:30 IST
ఘోర ప్రమాదం... ముగ్గురు మృతి
కర్నూలు: జిల్లాలోని వెల్దుర్తి హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు- ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.