రెండు బైకులు ఢీ... ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-08-14T14:53:39+05:30 IST
రెండు బైకులు ఢీ... ఇద్దరు మృతి
నంద్యాల: జిల్లాలోని బనగానపల్లెలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పలుకూరు-చెరువుపల్లె సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు పలుకూరుకు చెందిన తండ్రీకొడుకులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాని చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.