AP News: సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి పార్టీ టికెట్లు : చంద్రబాబు
ABN , First Publish Date - 2022-09-16T03:20:18+05:30 IST
Amaravathi: ఏపీకి రాజధాని అంశంపై టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) టీడీఎల్పీలో సమావేశంలో సుధీర్ఘంగా మాట్లాడారు. శాసనసభలో వైసీపీ (YSRCP) మంత్రులకు ధీటుగా ఎలా
Amaravathi: ఏపీకి రాజధాని అంశంపై టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) టీడీఎల్పీలో సమావేశంలో సుధీర్ఘంగా మాట్లాడారు. శాసనసభలో వైసీపీ (YSRCP) మంత్రులకు ధీటుగా ఎలా సమాధానం చెప్పాలో ఎమ్మెల్యేలకు వివరించారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని, అందుకు పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. ‘‘స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళిక చేశాం. ఖర్చు లేకుండానే 33 వేల ఎకరాల భూ సమీకరణ చేసి మౌళిక సదుపాయాలు సమకూర్చాo. అమరావతి (Amaravathi) నిర్మాణం పూర్తయితే సంపద సృష్టికి కేంద్రమవుతుంది. జగన్తో సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశాం. ఇప్పుడేమో స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అమరావతిపై మాట తప్పి, మడమ తిప్పింది జగన్మోహన్ రెడ్డే (CM Jagan)’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి పార్టీ టికెట్లు
టీడీఎల్పీలో సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ఎన్నికల అంచనాల నేపథ్యంలో ప్రకటించినట్లు సమాచారం.