వైసీపీపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-10-02T22:14:08+05:30 IST
వైసీపీపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
అనంతపురం: ధర్మవరంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో రూ.80 కోట్ల విలువైన భూమిని వైసీపీ రౌడీలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాయినగర్లో ఎన్నో ఏళ్లుగా నివాసమున్న వందల కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయినగర్ కాలనీలో ఒక్క ఇటుక తీసినా వైసీపీ పతనం తప్పదన్నారు.