మా ఊరి నుంచి వెళ్లిపోండి!

ABN , First Publish Date - 2022-03-06T08:41:21+05:30 IST

మా ఊరి నుంచి వెళ్లిపోండి!

మా ఊరి నుంచి వెళ్లిపోండి!

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం!

వంతెన మంజూరు కోరిన గ్రామస్థులు.. ఎమ్మెల్యే అసహనం 


పి.గన్నవరం, మార్చి 5: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పరాభవం ఎదురైంది. గంటిపెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో శ్మశానవాటికకు గ్రామస్థులు వెళ్లాలంటే తెప్పల సాయంతో పంట కాలువ దాటాల్సిందే. ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతోంది. ఈ క్రమంలో గంటిపెదపూడి నుంచి వస్తున్న చిట్టిబాబును ఉచ్చులవారిపేట గ్రామస్థులు అడ్డుకుని కొన్నేళ్లుగా తాము పడుతున్న బాధలను వివరించి, వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. త్వరలోనే లంకగ్రామాలకు వంతెన వస్తుందని, పంటకాలువపై కూడా వంతెన నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. కానీ, ఆ వంతెన ఎప్పుడు వస్తుందోనని, తమకు ప్రత్యేకంగా వంతెన కావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేసి వంతెన అవ్వదని చెప్పడంతో, అయితే వెళ్లిపోండంటూ ఆయనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగారు.

Updated Date - 2022-03-06T08:41:21+05:30 IST