మర్మాంగం కోసి హత్య

ABN , First Publish Date - 2022-01-28T09:50:59+05:30 IST

మర్మాంగం కోసి హత్య

మర్మాంగం కోసి హత్య

సీతానగరం, జనవరి 27: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భార్య.. భర్తను అతికిరాతంగా హత్య చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మర్రే అబ్బులు(46), ముత్యాలు భార్యాభర్తలు. వీరికి మద్యం తాగే అలవాటుంది. బుధవారం రాత్రి కూడా ఇద్దరూ తాగి గొడవపడి బయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున ముత్యాలు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది. రాపాక గ్రామ శివారు కల్వర్టువద్ద ఓ మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో అక్కడికి చేరుకున్నారు. తన భర్త ఫిట్స్‌ వల్లే చనిపోయాడని మృతదేహాన్ని ముత్యాలు దహన సంస్కారాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. మృతదేహంపై గాయాలు ఉండడం.. పురుషాంగం కోసేసి ఉండడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతుడి భార్యే హత్య చేసినట్లు అంగీకరించింది.

Updated Date - 2022-01-28T09:50:59+05:30 IST