సీపీఐ జాతీయ మహాసభలకు ప్రత్యేక లోగో
ABN , First Publish Date - 2022-08-13T08:47:20+05:30 IST
సీపీఐ జాతీయ మహాసభలకు ప్రత్యేక లోగో
విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే సీపీఐ జాతీయ మహాసభలకు ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగోను రూపొందించడానికి పార్టీ నేతలు జూలై నెలలో 15 రోజులపాటు పోటీలు నిర్వహించారు. ఇందులో ఎడ్ల సేతిన్.. కృష్ణవేణి విగ్రహంతోపాటు ప్రకాశం బ్యారేజ్ ఉన్న ఫొటోతో రూపొందించిన లోగోను నేతలు ఎంపిక చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ రూ.20 వేల బహుమతిని విజయవాడలో సేతిన్కు శుక్రవారం అందజేశారు.