2024 నాటికి శాశ్వత భూ పత్రాలు: కల్లాం
ABN , First Publish Date - 2022-08-13T08:55:22+05:30 IST
2024 నాటికి శాశ్వత భూ పత్రాలు: కల్లాం
కశింకోట, ఆగస్టు 12: రైతులకు 2024 నాటికి భూ శాశ్వత హక్కు పత్రాలు అందజేయడమే లక్ష్యంగా సమగ్ర సర్వే చేస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ గ్రామంలో జరుగుతున్న భూ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో సర్వే 90 శాతం పూర్తయిందన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఆర్డీవో చిన్నికృష్ణ, తహసీల్దార్ సుధాకర్, తదితరులు ఉన్నారు.