చెన్నై ఈడీ కోర్టుకు సుజనా

ABN , First Publish Date - 2022-08-13T08:48:33+05:30 IST

చెన్నై ఈడీ కోర్టుకు సుజనా

చెన్నై ఈడీ కోర్టుకు సుజనా

చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వివిధ బ్యాంకుల్లో రుణ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి శుక్రవారం చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టుకు హాజరయ్యారు. రుణ ఎగవేత ఆరోపణలపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ సైతం కేసులు పెట్టింది. వాటి విచారణకు సంబంధించి సుజనా చౌదరి చెన్నైలోని ఈడీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది.

Updated Date - 2022-08-13T08:48:33+05:30 IST