ఆంధ్ర పోలీసులకు కేంద్ర హోం మంత్రి అవార్డులు
ABN , First Publish Date - 2022-08-13T08:54:58+05:30 IST
ఆంధ్ర పోలీసులకు కేంద్ర హోం మంత్రి అవార్డులు
అమరావతి, న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఐదుగురు పోలీసులకు కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ - 2022 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ జాబితాను విడుదల చేసింది. డీఎస్పీ బీ సీతారామయ్య, ఏసీపీ శ్రీనివాసరావు కొల్లి, ఇన్స్పెక్టర్లు కన్నుజు వాసు, సత్యనారాయణ ముత్యాల, ఎస్ఐ ఖాదర్ బాషాకు మెడల్ లభించింది. కాగా, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ వంటి దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న అధికారులతో సహా వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులకు కలిపి మొత్తం 151 మందికి కేంద్రం ఈ మెడల్ను ప్రకటించింది. ఆగస్టు 15న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రమాణాలతో పరిశోధన చేసినందుకు కేంద్ర హోం శాఖ 2018 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది.