పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న టీడీపీ
ABN , First Publish Date - 2022-08-13T08:54:35+05:30 IST
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న టీడీపీ
గుంటూరులో భూమి పూజ... జెండా పండుగకు రానున్న బాబు
గుంటూరు(తూర్పు), ఆగస్టు 12: ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల నేపథ్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీడీపీ స్థానిక చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర ముఖ్యనేతలు హజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రాంగణంలో శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజా, గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్ ఇతర ముఖ్యనేతలు భూమి పూజ చేశారు. అనంతరం ప్రాంగణాన్ని పరిశీలించారు. గడ్డి, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగించి, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. వేడుకలకు హజరయ్యే టీడీపీ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలకు హజరయ్యే కార్యకర్తలు జాతీయ జెండాలు మాత్రమే తీసుకురావాలని, పార్టీ జెండాను తీసుకురావడం గాని, వాహనాలకు ఏర్పాటు చేయడంగానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ప్రజల మధ్యన నిర్వహిస్తున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు.