17న వ్యాపారుల సమర భేరి

ABN , First Publish Date - 2022-08-13T08:46:40+05:30 IST

17న వ్యాపారుల సమర భేరి

17న వ్యాపారుల సమర భేరి

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఈ నెల 17న విజయవాడలో వ్యాపారులు సమర భేరి మోగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం వెల్లడించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆధ్వర్యంలో ఆ రోజు వ్యాపారుల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై చర్చిస్తామని వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-13T08:46:40+05:30 IST