పరిహారం ఇస్తారా.. ఈ నీటిలోనే చావమంటారా!

ABN , First Publish Date - 2022-08-13T08:01:24+05:30 IST

పరిహారం ఇస్తారా.. ఈ నీటిలోనే చావమంటారా!

పరిహారం ఇస్తారా.. ఈ నీటిలోనే చావమంటారా!

వాళ్లంతా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం ము ల్లూరు గ్రామ ప్రజలు. పోలవరం ముంపు గ్రామమైన ముల్లూరులోకి ఇటీవల వరద నీరొచ్చింది. గోదావరి వరద ధాటికి గ్రామాలకు గ్రామాలు మునిగిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ వారు ఆగ్రహించారు. ఊళ్లోకి వచ్చిన గోదావరిలోనే జలదీక్ష చేపట్టారు. పోలవరం పరిహారం ఇస్తారా ఈ నీళ్లలోనే మునిగి చావమంటారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నెలరోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇచ్చి తమను తరలించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, టీడీపీ నాయకుడు కన్నారావు, సీపీఎం జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. - కూనవరం

Updated Date - 2022-08-13T08:01:24+05:30 IST