మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగ
ABN , First Publish Date - 2022-08-13T08:01:59+05:30 IST
మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగ
మైనార్టీశాఖ కార్యదర్శి ఇంతియాజ్
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వారసత్వపు కట్టడాలు, పురాతన మసీదులు, చర్చిల వద్ద శుక్రవారం జెండా పండుగ నిర్వహించినట్టు రాష్ట్ర మైనార్టీశాఖ కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జెండా మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ పిలుపు మేరకు ముస్లింలు, క్రైస్తవులు.. శుక్రవారం ప్రార్థనల అనంతరం జాతీయ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహించినట్లు ఒక ప్రటనలో పేర్కొన్నారు. విజయనగరంలోని జామియా మసీదు అతిపురాతనమైనదిగా పేరొందిందని ఆ మసీదు ఇమామ్, మౌజమ్ నిర్వహణా కమిటీ సభ్యులు ఇతర ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని చెప్పారు. ఏలూరులోని మదరసాలో విద్యార్థులు జాతీయ జెండా ఎగురవేస్తూ ర్యాలీలు నిర్వహించారన్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు తదితర జిల్లాల్లో జాతీయ జెండాలతో ముస్లింలు, క్రైస్తవులు ర్యాలీ తీసి జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.