జాతీయ జెండాతో జలాసనాలు

ABN , First Publish Date - 2022-08-13T07:58:19+05:30 IST

జాతీయ జెండాతో జలాసనాలు

జాతీయ జెండాతో జలాసనాలు

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓ అధికారి జాతీయ జెండాతో జలాసన ప్రదర్శనలు చేసి దేశభక్తిని చాటుకున్నారు. భారత నౌకాదళంలో 15 ఏళ్లపాటు సేవలందించి ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పనిచేస్తున్న తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ శుక్రవారం ఈ ప్రదర్శనలు నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని ఓ క్లబ్‌లో ఉన్న స్విమ్మింగ్‌ ఫూల్‌లో నీటిపై పడుకుని తేలియాడుతూ మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ విన్యాసాలు చేశారు. - ఒంగోలు నగరం

Updated Date - 2022-08-13T07:58:19+05:30 IST