మేకపాటి గౌతమ్‌రెడ్డి పెన్నా బ్యారేజీ పనుల్లో విషాదం

ABN , First Publish Date - 2022-08-09T03:12:17+05:30 IST

మేకపాటి గౌతమ్‌రెడ్డి పెన్నా బ్యారేజీ పనుల్లో విషాదం

మేకపాటి గౌతమ్‌రెడ్డి పెన్నా బ్యారేజీ పనుల్లో విషాదం

నెల్లూరు: జిల్లాలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి పెన్నా బ్యారేజీ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సంగంలోని బ్యారేజీ దగ్గర గేటు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. 13 టన్నుల గేటు పడి బిహార్‌కు చెందిన కార్మికుడు జయలాల్ మృతి చెందాడు. బ్యారేజీ నిర్వాహకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-09T03:12:17+05:30 IST