ఎవ్వరినీ వదిలిపెట్టం: నారా లోకేష్
ABN , First Publish Date - 2022-10-01T23:52:04+05:30 IST
ఎవ్వరినీ వదిలిపెట్టం: నారా లోకేష్
అమరావతి: ఏపీ సీఐడీ తీరుపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతకాయల విజయ్ ఇంటి దగ్గర ఏపీ సీఐడీ తీరు దారుణమన్నారు. ఎందుకు వచ్చారో చెప్పకుండా కుటుంబసభ్యులను బెదిరించారని ఆరోపించారు. నేరాలు చేస్తున్న వైసీపీ నేతలకు జగన్ సర్కార్ పదవులు కట్టబెడుతుందన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులతో రాక్షస ఆనందం పొందుతున్నారని లోకేష్ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి కుటుంబాన్ని టచ్ చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు.