గోవధ చట్టాలపై అవగాహన పోస్టర్ల విడుదల

ABN , First Publish Date - 2022-07-02T21:01:28+05:30 IST

గోవధ చట్టాలపై అవగాహన పోస్టర్ల విడుదల

గోవధ చట్టాలపై అవగాహన పోస్టర్ల విడుదల

గుంటూరు: గోవధ చట్టాలపై అవగాహన పోస్టర్లను విడుదల గో పరివార్ జేఏసీ విడుదల చేసింది. ఈ సదర్భంగా శివ స్వామి మాట్లాడుతూ... గోవును హైందవ ధర్మం ప్రపంచ మాతగా గుర్తించిందన్నారు. గో హత్యలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఆవులను వధించేందుకు ఇప్పటికే అక్రమరవాణా చేశారని చెప్పారు. 5వ తేదీన కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ర్యాలీకి అనుమతి కోరామన్నారు. ముందు అనుమతి ఇచ్చి తర్వాత లేదంటున్నారని పేర్కొన్నారు. గోచట్టాలపై అవగాహన కల్పనకు ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు. 

Updated Date - 2022-07-02T21:01:28+05:30 IST