‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’

ABN , First Publish Date - 2022-05-03T03:37:54+05:30 IST

‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’

‘వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’

గుంటూరు: రేపల్లె అత్యాచార కేసులో శవరాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలు దళితురాలు కావడంతో పరిహారం అందించడంలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బాధితురాలికి 10 లక్షలు పరిహారం, ఐదు ఎకరాల సాగు భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక చోట వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడి కొట్టారు...మరో చోట ఎమ్మెల్యే గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. 

Read more