గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-08-10T13:45:40+05:30 IST
గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
అమరావతి: గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రభావంతోమధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అధికారులను అప్రమత్తం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చేసింది. సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.