AP News: ప్రతిపాదనలకు ఆమోదం

ABN , First Publish Date - 2022-09-25T03:21:35+05:30 IST

నంద్యాల: శ్రీశైలం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి అధ్యక్షతన శనివారం శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. 30 ప్రతిపాదనలకుగాను 25 ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఐదింటిని వాయిదా వేశారు. క్షేత్ర అభివృద్ధి, రోడ్లు, విద్యుత్‌కు ట్రస్ట్ బోర్డ్ ఆమో

AP News: ప్రతిపాదనలకు ఆమోదం

నంద్యాల: శ్రీశైలం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి అధ్యక్షతన శనివారం శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. 30 ప్రతిపాదనలకుగాను 25 ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఐదింటిని వాయిదా వేశారు. క్షేత్ర అభివృద్ధి, రోడ్లు, విద్యుత్‌కు ట్రస్ట్ బోర్డ్ ఆమోదం తెలిపింది. అటవీశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో శ్రీశైల పరిధిలోని అటవీ భూముల  హద్దులను గుర్తిస్తామని చైర్మన్ తెలిపారు. పడితరం స్టోర్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్ర అభివృద్ధికి సీఎంను నిధులు అడిగామని, ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లు చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-09-25T03:21:35+05:30 IST