ఆ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాం: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2022-01-04T21:55:39+05:30 IST
ట్ల దగ్ధం ఘటన బాధాకరమని మంత్రి అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. 6 బోట్లను వేరే వర్గంవారు తీసుకుని వెళ్లారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు.
విశాఖపట్నం: బోట్ల దగ్ధం ఘటన బాధాకరమని మంత్రి అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. 6 బోట్లను వేరే వర్గంవారు తీసుకుని వెళ్లారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు. భీమిలి, మంగమారిపేట ప్రాంతాల్లో మంత్రి అవంతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సమస్యపై గతంలో 2 వర్గాల మత్స్యకార పెద్దలతో చర్చలు జరిపామన్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఏ వర్గం వారైనా చట్టానికి లోబడి ఉండాలన్నారు. లా అండ్ ఆర్డర్, మెరైన్ పోలీసులు బోటులు దొంగలించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, బోట్లను వెనక్కి తీసుకురావాలని మంత్రి అవంతి ఆదేశాలు జారీ చేశారు.