తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడు అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-15T23:59:14+05:30 IST
తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 కోట్ల రుణం మంజూరు అయినట్లు ఎంపీ గురుమూర్తికి యువకుడు ఫోన్ చేశాడు.
హైదరాబాద్: తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 కోట్ల రుణం మంజూరు అయినట్లు ఎంపీ గురుమూర్తికి యువకుడు ఫోన్ చేశాడు. సీఎంవో నుంచి కాల్ చేసినట్టు ఆ యువకుడు చెప్పాడు. ఆ నెపంలో 1.25 లక్షల చొప్పున డబ్బులు డిమాండ్ చేసి మోసం చేయాలని పన్నాగం పన్నారు. నకిలీ కాల్పై అర్బన్ ఎస్పీకి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు చేశారు. గతంలో ఇద్దరు ప్రజాప్రతినిధులను ఇలాగే మోసం చేసినట్లు విచారణలో వెల్లడిపరిచారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.