AP మంత్రుల బస్సు యాత్రకు ప్రజల ఆదరణ ఉందా?

ABN , First Publish Date - 2022-05-27T01:25:00+05:30 IST

సిక్కోలు నుంచి రాష్ట్ర మంత్రులు తలపెట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ...

AP మంత్రుల బస్సు యాత్రకు ప్రజల ఆదరణ ఉందా?

శ్రీకాకుళం: సిక్కోలు నుంచి రాష్ట్ర మంత్రులు తలపెట్టిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ ప్రారంభమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మంత్రులు మొత్తం 17 మంది పాల్గొనాల్సిఉండగా... 15 మంది మాత్రమే హాజరయ్యారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రవాణా శాఖమంత్రి పినిపి విశ్వరూప్‌లు గైర్హాజరయ్యారు. ముందుగా అరసవల్లిలో శ్రీసూర్యభగవానుడ్ని మంత్రులు దర్శించుకున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఉపాధిహామీ కూలీలను రప్పించారు.


అయితే సభలో వేదికపై ఉన్న మంత్రులకు టెంట్లు ఏర్పాటు చేశారు కానీ, జనం మాత్రం ఎండలో ఉండిపోయారు. ఎండ వేడిమి భరించలేక వారిచేతికి పార్టీనాయకులు ఇచ్చిన ప్లకార్డులను తలపై పెట్టుకుని ప్రసంగాన్ని ఆలకించారు. ఆ సమయంలో కొంతమందికి దాహం వేసి తమను వాటర్ ప్యాకెట్‌లైనా ఇప్పించాలని కోరారు. పాతబస్టాండ్‌ నుంచి సభ జరుగుతున్న ప్రాంతం వరకు సమీప దుకాణాలను మూసివేయించారు. దీంతో వాటర్‌ప్యాకెట్‌లు దొరకలేదు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కూలీలు సభ మధ్యలో వెళ్లిపోయారు. 


మరోవైపు మంత్రుల బస్సు యాత్రకు జన సమీకరణ బాధ్యతను వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ వార్డు వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని వార్డు సచివాలయాలకు అధికారులు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రుల బస్సు యాత్రకు లబ్దిదారులను తీసుకురాకపోతే వాలంటీర్లే బాధ్యత వహించాలని ఫోన్లలో హెచ్చరికలు చేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘మంత్రుల బస్సు యాత్రకు ప్రజల ఆదరణ ఉందా?. సామాజిక న్యాయంపై మాట్లాడే నైతికత వైసీపీకి ఉందా?. బడుగు జీవుల హక్కులను అణచి వేసింది జగన్ కాదా?. జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ మంత్రులకు అధికారులున్నాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-05-27T01:25:00+05:30 IST