ఏపీ మంత్రులు ఇప్పుడు నాని ఇంట్లో మహిళలను టార్గెట్ చేస్తారు: అనిత

ABN , First Publish Date - 2021-12-23T20:43:51+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కొనియాడారు. గురువారం ఆమె మీడియాతో

ఏపీ మంత్రులు ఇప్పుడు నాని ఇంట్లో మహిళలను టార్గెట్ చేస్తారు: అనిత

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కొనియాడారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్ద హీరోలు విజయవాడ వచ్చి సీఎం జగన్‌ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదని, సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నాని లాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని కోరారు. అన్ని రంగాలకు జగన్ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. హీరో నాని ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాడు కాబట్టి వారి ఇంట్లో మహిళలను ఇప్పుడు మంత్రులు టార్గెట్ చేస్తారని జోస్యం చెప్పారు. మాజీమంత్రి అశోక్ గజపతి తల్లిని తిట్టిన మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద లెక్క కాదని అనిత వ్యాఖ్యానించారు.


ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్ల కలెక్షన్‌ ఎక్కువైందన్నారు. టికెట్‌ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెప్పారు. తన పేరు ముందు నేచురల్‌ స్టార్‌ తీసేద్దాం అనుకుంటున్నానని తెలిపారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లాభనష్టాలు మాత్రం తర్వాత చూసుకుంటామని నాని తెలిపారు.

Updated Date - 2021-12-23T20:43:51+05:30 IST