తమిళనాడు గర్వపడేలా ఏపీలో పనిచేస్తా: మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-04-17T13:02:10+05:30 IST

మెట్టినిల్లయిన తమిళనాడు గర్వపడేలా పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లో పనిచే స్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా

తమిళనాడు గర్వపడేలా ఏపీలో పనిచేస్తా: మంత్రి  రోజా

చెన్నై: మెట్టినిల్లయిన తమిళనాడు గర్వపడేలా పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లో పనిచే స్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం కాంచీపురం కామాక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చిన రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు కూడా తాను మంత్రి కావాలని ప్రార్థించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. తాను ప్రతి ఏడాది కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటానని, ఎలాంటి కార్యక్రమమైనా చేపట్టే ముందు అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. పిల్లలు పుట్టరని తెలిపిన రోజుల్లో కూడా, కామాక్షి అమ్మవారిని వేడుకోవడంతో తనకు ఇద్దరు పిల్లలు జన్మించారని, దాంతో కామాక్షి అమ్మవారి మీద భక్తి అధికమైందని చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా కామాక్షి అమ్మవారిని దర్శించుకొని, కుంకుమార్చన చేసి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని, తాను మంత్రిని కావాలని పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని రోజా పేర్కొన్నారు. కాగా ఆలయంలో మంత్రి ఆర్‌కే రోజాను అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణారావు కలిశారు. స్మారక భవన నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు.



Updated Date - 2022-04-17T13:02:10+05:30 IST