విజయాలతో మరింత బాధ్యత పెరిగింది: పవన్
ABN , First Publish Date - 2021-11-19T01:16:42+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జనసేన అభ్యర్థులు ధైర్యంగా నిలిచారని జనసేన అధినేత పవన్ కల్యాణ్..
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జనసేన అభ్యర్థులు ధైర్యంగా నిలిచారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పక్షాన నిలిచి పోరాడిన ప్రతి అభ్యర్థికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు.