ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా జకీయా ఖానం

ABN , First Publish Date - 2021-11-26T18:08:14+05:30 IST

రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా జకీయా ఖానం ఎన్నికయ్యారు. మండలి సభ్యులు జకీయా ఖానంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా జకీయా ఖానం

అమరావతి: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా జకీయా ఖానం ఎన్నికయ్యారు. మండలి సభ్యులు జకీయా ఖానంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన జకీయా ఖానంను సీఎం, ఇతర ఎమ్మెల్సీలు కలిసి సభా స్థానాల్లో కూర్చోబెట్టారు. 


అనంతరం సీఎం సభలో జగన్ మాట్లాడుతూ....సాధారణ కుటుంబానికి చెందిన తమ అక్క జకీయా ఖానం డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని, ఆమెకు తన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ఈ అవకాశం మహిళకు ఇవ్వగలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. 

Updated Date - 2021-11-26T18:08:14+05:30 IST