ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
ABN , First Publish Date - 2020-04-08T04:38:15+05:30 IST
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...
అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఆగస్టు 5 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది.తాజాగా ఈ సస్పెన్షన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.