ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీఎస్ పాలనాధిపతి: ఐఏఎస్ అధికారుల సంఘం
ABN , First Publish Date - 2022-01-20T01:50:20+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రధాన కార్యదర్శి
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పాలనాధిపతి అని ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది. సీఎస్ సమీర్ శర్మపై ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ప్రకటన విడుదల చేశారు. అన్ని సంఘాల మాదిరిగానే ఉద్యోగుల పట్ల సీఎస్ బాధ్యత కలిగి ఉంటారని ఐఏఎస్ అధికారుల సంఘం గుర్తుచేసింది. సమస్యలపై వృత్తిపరంగా నిస్పాక్షికంగా తమ అభిప్రాయాలను ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుదోవ పట్టించారనే ఆరోపణలను అధికారుల సంఘం ఖండించింది. భవిష్యత్లో ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు పునరావతం కాకూడదని ఐఏఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది.