సాక్షి వార్త ఆధారంగా Elections రద్దు చేయడమేంటి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-11-10T01:51:38+05:30 IST

సాక్షి పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని ఎన్నికలను

సాక్షి వార్త ఆధారంగా Elections రద్దు చేయడమేంటి: హైకోర్టు

గుంటూరు: సాక్షి పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని ఎన్నికలను రద్దు చేయడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల రద్దుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయింది. ఎన్నిక రద్దుకు డీఈవో నోటీసులివ్వడాన్ని  హైకోర్టులో పిటిషనర్లు సవాల్‌ చేసారు. పిటిషనర్ల తరపున  న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు వాదించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని సాక్షి పత్రికలో రాస్తే రద్దు చేస్తారా అని లాయర్‌ సుబ్బారావు నిలదీసారు. సాక్షి పత్రిక వార్తను ఆధారంగా చేసుకుని ఎన్నికలు రద్దు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. రేపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 


Updated Date - 2021-11-10T01:51:38+05:30 IST