వివేకా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు
ABN , First Publish Date - 2022-01-07T01:45:03+05:30 IST
వివేకా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు
అమరావతి: వివేకా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్గా మారుస్తూ సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి పిటిషన్ను హైకోర్టు విచారించింది. వివేకా కేసులో ఇప్పటివరకు నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టుకు అందజేయాలని సీబీఐకి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక అభియోగ పత్రం కూడా కోర్టుకు అందించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.