ఏపీ ప్రభుత్వం జీవోను కొట్టేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-12T03:00:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది.

ఏపీ ప్రభుత్వం జీవోను కొట్టేసిన హైకోర్టు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

Updated Date - 2020-08-12T03:00:32+05:30 IST