సిఐడి అదనపు డీజీ సునీల్కు నోటీసులు
ABN , First Publish Date - 2022-03-09T17:44:13+05:30 IST
సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ కుటుంబాన్ని...
అమరావతి: సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని రిటైర్డు ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తండ్రి, సునీల్ కుమార్ మామ పెనుమాక సుబ్బారావు వేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న సునీల్.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, డీవోపీటీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, సీఎస్, డీజీపీ, ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.