జడ్జీలను దూషించిన కేసులో హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-10-06T21:18:22+05:30 IST

జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ చేసిన దర్యాప్తుపై హైకోర్టు విచారణ జరిపింది.

జడ్జీలను దూషించిన కేసులో హైకోర్టు విచారణ

అమరావతి: జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ చేసిన దర్యాప్తుపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దీనికి సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ వేశామని అధికారులు కోర్టుకు తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ దృష్టి సారించాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

Updated Date - 2021-10-06T21:18:22+05:30 IST