సినిమా టికెట్ల రేట్లపై AP highcourtలో విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-12-15T19:18:31+05:30 IST
రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి(గురువాం)కి వాయిదా వేసింది.
అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి(గురువాం)కి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్ను ఆశ్రయించింది. అయితే సింగిల్ జడ్జి తీర్పు కాపీ అందకపోవటంతో రేపు విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వెంటనే విచారించకపోతే ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో రేపు ఉదయం మొదటి కేసుగా తీసుకుందామని హైకోర్టు పేర్కొంది.